Menu

did-you-know ?

Planets to get good luck

planets to get good luck

గ్రహాల అనుగ్రహం పొందాలంటే..

మానవుల జీవితాలపై గ్రహాల ప్రభావం ఉంటుందని మనం తెలుసుకున్నాం. గ్రహాలన్నీ అనుకూలిస్తే గనక జీవితం సుఖమయంగా ఉంటుంది. అవే గ్రహాలు ప్రతికూలిస్తే దుఃఖమయంగా ఉటుందని చెప్పవచ్చు. నిజానికి ఈ పరిణామాలు, పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉండవు. ఈ విశ్వాన్ని శాసించే గ్రహాలు, నక్షత్రాల చేతుల్లో ఉంటాయి. మనం పుట్టిన సమయంలో గ్రహాల తీరునుబట్టి మన జాతకం ఆధారపడి ఉంటుంది అంటారు. అందుకే జాతక చక్రాలు భూమిపై ఆయా గ్రహాల ప్రసరణ వంటి వివరాల ఆధారంగానే భవిష్యత్‌ను అంచనా వేస్తారు.

గ్రహాల శుభ దృష్టి ఉంటే శుభసూచకం అని, ప్రతికూల దృష్టి ఉంటే అశుభం అని భావిస్తారు. ప్రతికూల దృష్టిగల సందర్భాలలో ఆయా గ్రహాల ప్రీతికోసం జపాలు, తర్పణాలు, హోమాలు చేయడంతో పాటుగా గ్రహ సంబంధిత క్షేత్రాలను దర్శించడం జరుగుతోంది.

దోషం, గండం వంటి వాటిని అంచనా వేయడంతో పాటు చేపట్టాల్సిన పూజాధికాల్ని జోష్యులు సూచిస్తారు. నక్షత్ర బలాన్నిబట్టి నామకరణం కూడా చేయడం ఆనవాయితీ. ఈ విషయాలకంటే ప్రదానమైన విషయం మరొకటి ఉంటుంది. పుట్టిన నక్షత్రం, రాశి ఆధారంగా స్వభావం, సహజ లక్షణాలు, పరిస్థితుల్ని అంచనా వేసుకోవడం, వాటినిబట్టి చేసే గణనలు, అంచనాలు కచ్చితంగా ఉండడమే కాకుండా రెమెడీస్‌కూడా సూటిగా ఉంటాయి.

పరిస్థితులు, మనస్తత్వాలు, కష్టాలు, నష్టాలు అన్నీ గ్రహాలను బట్టే ఉంటాయి కాబట్టి.. గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహారాధన చేస్తాం. ఈ పూజలు, అర్చనలు, దానాల సంగతి అలా ఉంచితే అంతకంటే తేలికైన మార్గం ఒకటి ఉంది.

ఒక్కో వారానికీ ఒక్కో గ్రహం అధిపతి
ఆదివారం – సూర్యుడు,
సోమవారం – చంద్రుడు,
మంగళవారం – కుజుడు,
బుధవారం – బుధుడు
గురువారం – బృహస్పతి
శుక్రవారం – శుక్రుడు
శనివారం – శని

అయితే, గ్రహాల అనుగ్రహం పొందేందుకు, ఆయా వారాల్లో మన దుస్తుల రంగులు ఇలా ఉండేలా చూసుకోవాలి.

ఆదివారం – ఎరుపు
సోమవారం – తెలుపు
మంగళవారం – నారింజ రంగు
బుధవారం – ఆకుపచ్చ
గురువారం – పసుపుపచ్చ
శుక్రవారం – తెలుపు
శనివారం – నీలం లేదా నలుపు రంగు

గ్రహాలకు ఇష్టమైన రంగులను ఉపయోగించడంవల్ల, గ్రహాలూ మనపట్ల ఆకర్షితమై అనుకూలంగా ఉంటాయని, అనుకున్న పనులు ఎలాంటి విఘ్నాలూ లేకుండా సవ్యంగా జరుగుతాయని శాస్త్రం చెబుతోంది.
అయితే ఇవి అన్నియు కూడా జ్యోతిష్కులను సంప్రదింఛి చేయుట మంచిది.

జ్యోతిష్యం – ఆరోగ్యం
గ్రహాల దుష్ట కిరణాల ప్రభావం వల్ల మానవుడిలో ఏర్పడే శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతాయి. గ్రహాల మంచి కిరణాల ద్వారా వృద్ధి చెందిన వృక్ష జాతులు ఔషధాలవుతాయి అనేది జ్యోతిర్వైద్య సిద్ధాంతం.

చంద్రుడు
కాల్షియంకు ముత్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సుకు చంద్రుడు ఆది దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షియం తగ్గినప్పుడు ముత్యపు భస్మం ముందుగా తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉంది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్‌) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తుంది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇస్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని శాస్త్రం చెబుతోంది.

కుజుడు
ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జకు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్‌ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే. కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపు పై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్‌ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్‌ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుంది. ఎములలోని మజ్జలో పగడం కలిసిపోతుందని ఫ్రాన్స్‌ శాస్త్రవెత్తల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. కుజుడికి ధాన్యమైన కంది పప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే. ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్‌ శాస్తవెత్తల కృషి ఫలితం.

బుధుడు
బుధుడు నరాలకు సంబంధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెస లు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.

గురుడు
గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్‌ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్‌ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్పడే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్‌ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్‌ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్‌ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది.చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చంద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.

శుక్రుడు
ఇక శుక్ర గ్రహం సౌందర్యానికీ కారణమవుతుంది. శుక్రుడు నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుంచే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.

శని
చర్మంలోని మాలిన్యాలను వెలువరించే శక్తికి శని అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతి. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. నువ్వుల నూనె శరీరానికి పట్టించి అభ్యంగనం చేస్తే రోమ కూపాలు శక్తివంతమై చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి.

ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశ్లేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎక్కువగా పండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి. సప్త గ్రహాల సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటే అందం, ఆరోగ్యం మన చెంత ఉన్నట్టే.

Between wife and husband

Between wife and husband

దంపతుల మధ్య కలహాల నివారణకు..

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలెంతో విశిష్టమైనవి. ప్రపంచ దేశాలకే ఆదర్శమైనవి. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి హాయిగా జీవించేందుకు ఎన్నోవ్రతాలు, నోములు, పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఇవి అనాదిగా ఆచరింపబడుతూ దాంపత్య జీవనాన్ని పటిష్ఠంగానూ, సుఖమయంగా గడపేందుకు ఎంతో దోహదపడుతున్నాయి.

అలాంటి వాటిలో చైత్రమాసంలో వచ్చే అనంగత్రయోదశి ఒకటి. ఈ రోజు శివుణ్ని పూజిస్తే సంవత్సరంలో ప్రతి రోజూ శివుడిని పూజించిన ఫలం లబిస్తుందని శాస్త్ర వచనం. అదేవిధంగా ఈ రోజు మన్మధుని పూజిస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత వృద్ధి చెందుతుంది.

భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- ‘అనంగత్రయోదశీ వ్రతం’. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.

దంపతుల అన్యోన్యం – వాస్తు ప్రభావం
పంచభూతాల్లో భూమి ఒకటి. మానవుని జీవితానికి ఆధారమైన భూమిని వాస్తు ప్రకారం నైరుతి దిశతో పోల్చుతారు. ఈ దిశను నైరుతి లేదా కుబేర దిశగా పిలుస్తారని వాస్తు నిపుణులు అంటున్నారు. నైరుతి దిశ వాస్తులో కీలకమని, ఈ దిశలో ప్రధాన ద్వారాలు, తలుపులు, కిటికీలు వంటివి ఏర్పాటు చేయకూడదని వాస్తు చెబుతోంది.

ఈ దిశను తెరిచి వుంచకూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ దిశ ఎప్పుడూ ఎత్తుగా ఉండాలని, ఈశాన్యం తగ్గితే మంచిది. కుబేర దిశలో తలుపులు ఉండకపోవడం ద్వారా ఇంటి యజమానికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఉండవని వాస్తు శాస్త్రం చెబుతోంది.

 భార్య భర్తల మధ్య విరోధము తొలగిపోవుటకు
మూలమంత్రము:-” ఓం నమో మహాయక్షిణ్యె మమ పతిం (ఆముకం ) మే వశ్యం కురు కురు స్వాహా “

భార్య భర్తల మధ్య విరోధము వచ్చి భార్య పుటింటికి వెళ్లి వుండిపోయిన రోజులలో రాత్రిపూట ఆవు నేతితో దీపం
వెలిగించి ఆ దీపం వద్ద స్త్రీ కుర్చుని పైన వ్రాసిన మంత్రమును 108 సార్లు చొప్పున 11 రాత్రులు జపం చేస్తే ఆమె భర్త
తనంత తానుగా వచ్చి తన భార్యను ప్రేమగా తీసుకువెళ్లిపోవును. సుఖంగా కలతలు లేకుండా కాపురం చేయుదురు. ఈ రహస్యం భర్తకు తెలియనియకూడదు.

కుజ దోషం
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు.. రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంట, పన్నెండవ ఇంట  కుజుడు ఉండకూడదని. కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించావలైన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతన హీనత , దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది

వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి. కావున భయపడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి, జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం, నమ్మకము, విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ  ఉండాలి. భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్నా భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.

కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు
·              సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
·              ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
·              బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
·              మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
·              స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
·              ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.
·              కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.
·              రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
·              పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.
·              రక్త దానము చేయుట చాల మంచిది.
·              అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
·              కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
·              రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.
·              కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.
·              కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.
·              ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.
·              కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.