Menu

did-you-know ?

Jyothishyam- Vasthu

Jyothishyam-Vasthu

జ్యోతిష్యం-వాస్తు కలిస్తే సంపూర్ణ జీవితం..!

మానవుడి జీవితంపై పంచ భూతాల, ప్రకృతి శక్తుల ప్రభావం ఉంటుంది. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మనిషి జీవితంలో జ్యోతిష్యం.. వాస్తు రెండిటి ప్రభావం కలిసి ఉంటుంది. ఇందులో జ్యోతిష్యం శారీరక అంగాలలో కన్ను అయితే.. వాస్తు దృష్టిలాంటిది.

జ్యోతిష్య శాస్త్రం మనిషికి మూడోనేత్రం లాంటిది. జ్యోతిష శాస్త్రంలో 1. సిద్ధాంత, 2. సంహిత, 3. హోర, 4, శకున 5. ప్రశ్న విభాగాలుగా ఉన్నాయి. అందుకే జ్యోతిష్యశాస్త్రాన్ని పంచ స్కందత్రయమని అన్నారు. ఇందులో ప్రతి విభాగానికి ఓ ప్రత్యేకత ఉంది. సకల మంత్రములలోనూ గాయత్రి ఎంత ప్రధానమో.. సకల శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్ర ప్రాధాన్యత అంత గొప్పగా చెప్పగలగాలి. ఇందులో ముఖ్యంగా సిద్ధాంత భాగాన్ని పరిశీలిస్తే.. గణిత, ఖగోళ శాస్త్రాల గురించి చెప్పారు. హోరా భాగాన్ని చూస్తే జనన సమయ నిర్ధారణ, జాతక నిర్మాణము, షోడశ వర్గులు సాధన చేసే విధానం ప్రతివారికి ఉపయోగపడే వివిధ రాజయోగాలు, పూర్వ జన్మ విశేషాలు ఉన్నాయి. సంహిత భాగాన్ని పరిశీలిస్తే.. అందులో మనకి వాస్తుకు సంబంధించిన అనేక విషయాలు కనబడతాయి. దేవాలయ, తటాక, ఆరామ, గ్రామ, గృహ, శిల్ప వాస్తులన్నీ అందులోనే కనబడతాయి. అంతేగాక జలార్గళం, వివిధ రత్నాలు, పశు సాముద్రికం, అంగ సాముద్రికం వంటి అంశాలను గమనించవచ్చు.

జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగాన్ని తీసుకున్నట్లయితే ‘సంహిత’ అనగా కూర్చబడేది, పేర్చబడేది అని అర్థం. అనేక రకాల అంశాలను కలిపి ఇందులో పేర్చి మనకి అందించారు. జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగంలోని ఒక భాగమే వాస్తుశాస్త్రం. అంటే జ్యోతిష్య శాస్త్రంలోని ఒక భాగమే వాస్తు శాస్త్రమని అందరూ అర్థం చేసుకోవాలి.

నివాస గృహం అనేది ప్రకృతి శక్తులను స్వేచ్ఛగా ఆహ్వానించేదిగా ఉండాలి. అప్పుడు ఆ ఇంటి యజమాని జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. పంచభూతాల గమనం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం అందరికీ తెలియదు. దానికొక శాస్త్రం ఉంది. అదే వాస్తు శాస్త్రం. గృహ నిర్మాణానికి సలహాలు, ఇంటిలో మార్పులు చేర్పులపై సూచనలు ఇచ్చేవారే వాస్తు నిపుణులు.

దశలను చెప్పేది జ్యోతిష్య శాస్త్రం, దిశలను సూచించేది వాస్తు శాస్త్రం. ‘దశ బాగుంటే, దిశ బాగుంటుంది’ అన్న నానుడి అందరికీ తెలిసిందే. అంటే జ్యోతిష్యం ప్రకారం నడుస్తున్న దశలు బాగున్నప్పుడే మనం ఉంటున్న దిశలు (వాస్తుప్రకారం) బాగుంటాయి అన్నది అర్థవంతమైన సంగతే కదా!

దశలు, దిశలు సరిచేసుకున్నప్పుడే వ్యక్తి జీవితం బాగుంటున్నది నిర్వివాదాంశం. కుటుంబానికి వాస్తు, జ్యోతిష్యం రెండూ రెం డు కన్నులే గాని ‘కేవలం వాస్తే ప్రధానం.. కాదు.. కాదు.. జ్యోతిష్యమే ప్రధానం’ అని అనుకోకూడదు. వ్యక్తి జీవిత చక్రంలో వున్న సమస్యలను సరిగా విశ్లేషించి నడుస్తున్న దశలు, అంతర్ధశలు, గోచార ఫలితాలు గమనించి ఎలాం టి ప్రతిబంధకాలని అతను ఎదుర్కొంటున్నాడో గమనించి దానికి తగ్గ రెమెడీస్‌ (పరిహార క్రియలు.. అనగా జపం, దానం, శాంతి, హోమం, రత్నధారణ మొదలగునవి) పాటించి.. ఆ ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడగలిగిన తరువాతే ప్రశాంతత వస్తుంది. 50 శాతంకు పైగా జాతక ప్రభావం మనిషిపై ఉంటుంది. ఇంక మిగిలిన వాస్తును సరిచేసుకోవాలి.

ఎలాంటి ఇంట్లో ఉండాలి..? ఏ ముఖ ద్వారం ఉండాలి..? ఇలా ఇల్లంతా… లోపల, బయట కూడా వాస్తు ప్రకారం ఉందా..? వీధి శూలలు, వెన్ను శూలలు లేవుకదా..? చుట్టూ సక్రమమైన ప్రహారీ ఉందా? అంతేగాక ఇంట్లో వస్తువులన్నీ వాస్తు ప్రకారం అమి రాతయా లేదా?అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే వ్యక్తి పైన జాతకం ప్రభావం దాదాపు జాతకం 60 శాతం ఉంటే, వాస్తు 40 శాతం ఉంటుంది. రెండూ సరిగ్గా ఉండాలి. ఏది సరిగ్గా లేకపోయినా దాని ప్రభావం ఆ వ్యక్తిపైన ఉండి తీరుతుంది. అంతేకాదు మనకి నడుస్తున్న దశలు సరిగ్గా లేనప్పుడు మనం ఉండే గృహం కూడా వాస్తు సరిగ్గా లేనిదే అవుతుంది.

కనుక.. వ్యక్తి జాతకాన్ని ముందుగా పరిశీ లించి అతను ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషించి అట్టి వ్యక్తి ఎలాంటి రూములో, ఎలాంటి ద్వారము, ఎలాంటి సమస్యలున్న ఇంట్లో ఉంటున్నాడో చెప్పగలుగుతున్నాము. అంటే జ్యోతిష్య శాస్త్రంను బట్టే ప్రధానంగా మనం గ్రహించి చెబుతున్నా ము. అప్పుడు ఆ దశలను బట్టి పరిహార ప్రక్రియలు వ్యక్తి పాటించి 60 శాతం ఊరట చెందాక, ఆ ద్వారానికి, ఇంటికి గాని ఉన్న సమస్యను కూడా వాస్తు ప్రకారం సరి చేస్తే పూర్తి స్థాయి మంచి ఫలితాన్ని అతను అనుభవించగలడు. కేవలం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టేసి అందులో వ్యక్తిని ఉంచితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆ వ్యక్తికి నడుస్తున్న దశలు ఎంత అధ్వాన్నంగా ఉన్నా మామూలుగా మారిపోలేడు కదా? లేని రాజయోగాలు రావు కదా.. అలా అని జ్యోతిష్యం ప్రకారం రెమెడీస్‌ పాటించి వాస్తు బాగుండని ఇంట్లో ఉంటే ఫలితాలు సగమే ఉంటాయన్న విషయం మరిచిపోకూడదు.

ఎవరైనా సరే జ్యోతిష్యం ప్రకారం నడిచే దశలు, గోచారాన్ని ముందుగా చూపించుకొని అసలు ఆ వ్యక్తి జీవితంలో అతను ఆశిస్తున్నవి అనగా సంసారం, పిల్లలు, ఆయుష్షు, ఆరోగ్యం, ఉద్యోగం.. ఇత్యాది విషయాలు ఉన్నాయా? ఉంటే అవి రాకుండా ప్రతిబంధకాలు ఏం వుంటున్నాయి? అవి సరిచే యగలమా? జ్యోతిష్య పరంగానూ, పరిహారక్రియలను ప్రయోగించి అన్ని అంశాలను పరిశీలించుకోవాలి. ఆ తర్వాత వాస్తు పరంగా ఇల్లు ఉందా..? లేక ఇల్లు మారటానికైనా, మార్చటానికైనా తగిన బలాన్ని సాదించుకోవటానికి ఏం చేయాలి? జోతిష్యపరంగా అని ఆలోచించాలి? ఆ రకంగా జ్యోతిష్య, వాస్తు సమ్మేళనాన్ని ఉపయోగించి జీవితాన్ని బాగుచేసుకోవాలి.

జ్యోతిష్య శాస్తప్రరంగా మనకి లేని ను దుటిరా తను వాస్తు బాగున్న ఇంటిలో ఉండి పొందలేం. వాస్తు బాగుండని ప్రదేశంలో నివసిస్తున్నా.. జ్యోతిష్యపరంగా రావాల్సిన యోగాలని ఎలాంటి ఎలాంటి అడ్డంకులు, ప్రతిబంధకాలు లేకుండా సాధించలేం. రెండూ కావాలి. రెండింటిలోనూ లోపాలను పరిహారక్రియల ద్వారా సరిచేసుకోవాలి. కేవలం జ్యోతిష్యం చాలు. వాస్తు లేదు అనుకోవద్దు. అలాగే వాస్తు మాత్రమే జీవితాన్ని మారుస్తుంది, జ్యోతిష్యం అనవసరం అనుకోవద్దు. ముఖ్యంగా జ్యోతిష్యంలో ‘జన్మ కుండలిలోని లోపాలను పరిహార క్రియలు పాటించి సరిచేస్తే బుర్రకి స్థిరస్థ్వం చేయాలనే సంకల్పం ఏర్పడితేనే వాస్తు ప్రకారం ఆలోచిద్దామనే అభిప్రాయం ఏర్పడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే వ్యక్తి జాతకం బాగున్నంత కాలం వాస్తు ప్రభావం అంతగా బయట కనపడదు. జాతకం బాగులేనప్పుడే వాస్తు ప్రభావం అమితంగా కనపడుతుంది. దశ బాగుంటే దిశ బాగుంటనేది దీనర్ధం. అనారోగ్యం (జలుబు) తో ఉన్న వ్యక్తి వర్షంలో వెళుతున్నప్పుడు ‘గొడుగు’ యొక్క అండతో కాపాడబడతాడు. అనారోగ్యం ఉండడం (జాతకం బాగోని వ్యక్తి) జ్యోతిష్యం అయితే గొడుగు అనేది వాస్తు శాస్త్రం. అంటే జాత కం బాగుండకపోతే ‘సమస్య జటిలమవుతుంది’ అని దీని సారాంశం. అందుకే వ్యక్తికి జాతకం + వాస్తు = జీవితం. అన్నది అతి ముఖ్యమైన విషయం ఏదో ఒకటే చూడరాదు. రెండూ సరిచూసుకొని జీవితాన్ని సక్రమమార్గంలో పెట్టుకోవాలి.

ఎవరైనా సరే జాతకంలో వున్న దోషాలను ముందుగా పరిహార ప్రక్రియల ద్వారా సంపూర్ణంగా సరిదిద్దుకోవాలి. అలాగే వాస్తు దోషాలు సరి చేసుకోవాలి.

అందుకే జ్యోతిష్యశాస్త్రాన్నే ప్రదానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ‘అప్రత్యక్షాణి శాస్త్రాణి వివాదన్తేషు కేవలం ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్క యాత్ర సాక్షి ణా’ సూర్యచంద్రుల సాక్షిగా ఈ శాస్త్రం ప్రత్యక్ష ఫలితాలందిస్తుందని భావం. ‘యధాశిభా మ యూరాణాం నాగానాం మణయో యథ తద్వ ద్వేదాంగ శాస్త్రాణాం జ్యోతిష్యం మూర్ధ నిస్తతం’ (ఋగ్జేతిహం)నెమళ్ళకు పింఛములాగా, పాము
లకు తలపై నుంచే మణిలాగా వేదాంగ శాస్త్రాలన్నింటిలోనూ జ్యోతిష్య శాస్త్రం అఖండమైనది.‘వేదచక్షసా…’ వేదపురుషునికి కన్నులాంటిది.

Japam- Japamaala

Japam- Japamaala

జపం, జపమాలలు – ఫలితాలు

జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా ‘జపయజ్ఞం’ గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు.

జపమాలలు 3 రకాలు
1. కరమాల

అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.

2. అక్షమాల
‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా  ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.

3. మణిమాలలు
రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.

ఫలితములు

రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాల జపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటి గుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపు మాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసి మాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.

జపం 3 విధాలుగా ఉంటుంది

1. వాచింకం
మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.

2. ఉపాంశువు

తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.

3. మానసికం

మనస్సులోనే మంత్రాన్ని జపించడం.
వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడా చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్ట దేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం చెబుతోంది. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.

ఎలా చేయాలి..?
తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.

త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా
తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే

అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.

దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.

గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు.

జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో ‘పగడాల మాల’ కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి.